ఉన్నత విద్యలో తెలంగాణ మహోన్నతంగా ఎదిగింది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) ఉన్నత విద్యలో టాప్లో నిలిచింది. బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ర్టాలు ఫెయిల్ అయ్యాయి. జాతీయ సగటును కూడా చేరుకోలేక చతికిలపడ్డాయి. ఈ విషయాన్ని ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2019- 20 నివేదిక స్పష్టంచేసింది. గడిచిన ఏండేండ్లలో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటులో తెలంగాణపై మోదీ సర్కారు తీవ్ర వివక్షచూపింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో ఏడు ఐఐటీలు, రెండు ఐఐఎస్ఈఆర్లు, 16 ట్రిపుల్ఐటీలు, నాలుగు ఎస్ఐడీలు, 157 మెడికల్ కాలేజీలు, 84 నవోదయ పాఠశాలలు ఏర్పాటుచేస్తే వీటిల్లో తెలంగాణ రాష్ర్టానికి ఒక్కటీ కేటాయించలేదు. అయినా, తెలంగాణ రాష్ట్రం ఉన్నత విద్యలో ఎన్రోల్మెంట్లో అగ్రస్థానంలో నిలిచింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) ఉన్నత విద్యలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ సగటుకు మించి ఫలితాలు నమోదుచేసింది. జాతీయంగా జీఈఆర్ 27.1 శాతం ఉండగా, తెలంగాణ 35 శాతంతో అదరగొట్టింది. డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు జాతీయ సగటుకు ఆమడదూరంలో నిలిచాయి. ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2019- 20 నివేదిక ప్రకారం బీజేపీ పాలిత రాష్ర్టాలు ఫెయిల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో నమోదు, తీరుతెన్నులను వివరించే ఈ నివేదికలో మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ 21.2 శాతంతో చాలా వెనుకబడింది. 18 -23 ఏండ్ల మధ్య వయస్కుల నమోదు వివరాలను ఈ సర్వే బయటపెట్టింది. జాతీయ సగటు 27.1 శాతంగా ఉంటే.. బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్ 25.3 శాతం, అస్సాం 17.3 శాతం, త్రిపుర 20.2 శాతం జీఈఆర్తో విఫలమయ్యాయి. రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని జీఈఆర్ వివరాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 16 రాష్ర్టాలు జాతీయ సగటు కన్నా వెనుకంజలో ఉండగా, వీటిలో అత్యధికంగా కేంద్రపాలిత ప్రాంతాలు, బీజేపీ పాలిత రాష్ర్టాలే ఉన్నాయి.
అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం..
జీఈఆర్ జాతీయ సగటు 27.1 శాతం కాగా, తెలంగాణ 35 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. అమ్మాయిలు 36.4 శాతంతో ముందంజలో ఉండగా, అబ్బాయిలు 34.8 శాతంతో కాస్త వెనుకబడ్డారు. రాష్ట్రంలో ఎస్సీ అమ్మాయిల నమోదు 35.8%ఉంటే, అబ్బాయిల నమోదు 29.1 శాతంగా ఉన్నది. ఎస్టీ అబ్బాయిలు 31.3 శాతంతో ముందంజలో ఉంటే, అమ్మాయిలు 29.1 శాతంతో వెనుకబడ్డారు. దేశంలోనే అత్యధిక గురుకులాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ కీర్తిగడిచింది. రాష్ట్రం లో 978 గురుకులాల్లో 5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులోని ప్రతివిద్యార్థిపై ప్రభుత్వం రూ.1.25 లక్షలు వెచ్చిస్తున్నది. 64% డిగ్రీ కాలేజీలు, వర్సిటీలు పెరగడంతో ఉన్నత విద్యలో రాష్ట్రం టాప్లో నిలిచింది.
ఇవి అధ్వాన్నం..