హైదరాబాద్,జూన్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం వానకాలం (ఖరీఫ్) రైతు భరోసా నిధులను ఈనెల 30 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించిందని, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈనెల 15నాటికి కొత్తగా పట్టాదారు పాస్పుస్తకాలు పొందిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులు తమ దరఖాస్తులను జూలై 7వరకు సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. రైతులు తమ పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీలతో ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్డెత్పై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్చార్సీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏపీ పోలీసుల అధికార దుర్వినియోగంపై మండిపడింది. లాకప్ డెత్ అంశంపై తెలంగాణకు చెందిన మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఎన్హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం బాధితుడి తల్లి గాదె విజయలక్ష్మికి తక్షణమే భద్రత కల్పించాలని ఆదేశాలు జారీచేసింది. వారం రోజుల్లో సమగ్ర యాక్షన్ రిపోర్టును సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.