హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): వానకాలం ముగియడంతో అధికారులు వాటర్షెడ్-2.0 పథకం అమలుపై దృష్టి సారిస్తున్నారు. గత ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకంలో 20 జిల్లాల్లో 34 క్లస్టర్లలో 1.41 లక్షల హెక్లార్లను ఎంపిక చేశారు. ఈ పథకం కింద వచ్చే ఐదేండ్లలో రూ. 357.65 కోట్లు వెచ్చించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే రూ.46 కోట్లు విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ పనులు, గుట్టలు, కొండ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచడం, పేద రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యాలు.
ప్రధానంగా చేపట్టే పనులు
ఫాంపాండ్స్, చెక్డ్యాంలు, రాక్ఫిల్ డ్యాం లు నిర్మిస్తారు. వ్యవసాయ యంత్రాలు, పరికరాలను 75% సబ్సిడీపై అందజేస్తారు. నిరుపేద రైతులకు జీవనోపాధులను కల్పిస్తారు. వివిధ వ్యాపారాలు చేసుకోవడానికి సెర్ప్ ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తారు.