హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉన్నట్టయితే తొలుత మంత్రివర్గంలో 33శాతం మహిళలకు చోటు కల్పించాలని తెలంగాణ విద్యార్థి ఐకాస చైర్మన్ వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవులు, పార్టీ అధ్యక్ష పదవుల్లోనూ అవకాశాలు కల్పించాలని సూచించారు.