Bandi Sanjay | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ( BJP ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )కు రాష్ట్ర మహిళా కమిషన్( State Women’s Commission ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. ఎమ్మెల్సీ కవితపై సంజయ్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణ చేపట్టింది.
ఎమ్మెల్సీ కవితపై అదే పనిగా నోరుపారేసుకుంటున్న బండి సంజయ్ను మహిళలు హెచ్చరించారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. మహిళా లోకానికి, కవితకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం అన్ని చోట్ల బండిపై పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ప్రచార యావతో, నోటిదురుసుతనంతో బండి చేస్తున్న వ్యాఖ్యలతో ఆయనను ప్రజలు పిచ్చోడిగా పరిగణిస్తున్నారు.