హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుడు రమావత్ ధన్సింగ్ ఉద్యోగ విమరణ సన్మాన సభను సోమవారం కార్యాలయంలో నిర్వహించారు. తోటి సభ్యులు పూలబొకేలు, శాలువాలతో ధన్సింగ్ దంపతులను సత్కరించారు.
టీఎస్పీఎస్సీ సభ్యుడిగా పని చేయడం కొత్త అనుభూతిని ఇచ్చిందని ధన్సింగ్ పేర్కొన్నారు. తాను ఉద్యోగం సాధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ సభ్యులు కారం రవీందర్రెడ్డి, సుమిత్ర ఆనంద్ తనోబా, బండి లింగారెడ్డి, ఆర్ సత్యనారాయణ, కోట్ల అరుణకుమారి పాల్గొన్నారు.