హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టం దీక్షాదివస్ అని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్ అన్నారు. మంగళవారం బహ్రెయిన్లో ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో దీక్షాదివస్ను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సతీశ్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనకు కేసీఆర్ నవంబర్ 29న సత్యాగ్రహాన్ని ఆయుధంగా మార్చారని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలను ఏకంచేసిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాటి కేంద్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించారని గుర్తుచేశారు. రాష్ర్టాన్ని సాధించి.. అదే స్ఫూర్తితో నేడు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎన్నారై సెల్ ప్రతినిధులు వెంకటేశ్ బొలిశెట్టి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, రాజేందర్, దేవన్న, కిరణ్గౌడ్, సాయన్న, సతీశ్గౌడ్, లింగం తదితరులు పాల్గొన్నారు.