హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): పోలీసులకు టీఏలు, అలవెన్సులు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందని, సరెండర్, జీపీఎఫ్ మంజూరు కోసం ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మీడియాలో తప్పుడు కథనాలను ప్రచురిస్తూ పోలీసు ఉద్యోగులను ఆందోళనకు గురిచేయొద్దని కోరారు. ‘ఖాకీలకు జీతాల్లేవ్’ శీర్షికతో ఒక పత్రికలో వచ్చిన వార్త తప్పుదోవ పట్టించేలా ఉన్నదని పేర్కొన్నారు.
జీతాలు కొందరికి ఆలస్యంగా వస్తున్నమాట నిజమే అయినా, ‘జీతాల్లేవ్’ అనేది తప్పుడు వార్త అని స్పష్టంచేశారు. ఇటీవల ఏఎన్ఎస్ అలవెన్స్ విషయంలో తలెత్తిన ఇబ్బందులను ప్రభుత్వంతో డీజీపీ అంజనీకుమార్ చర్చించి పరిషరించారని గుర్తు చేశారు. ఎస్ఐల పదోన్నతి విషయంలో తలెత్తిన వివాదాలను పరిషరించడంతో ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుళ్ల పదోన్నతికి మార్గం సుగమం అయిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అన్ని సమస్యలను పరిషరిస్తుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు.