హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులు డ్రగ్స్ వినియోగించినా, వాటి అక్రమ రవాణాలో భాగస్వామ్యులైనా ఇకనుంచి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర పోలీసు శాఖ హెచ్చరించింది. ఆయా విద్యాసంస్థలు ఈ విషయంపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. డ్రగ్స్తో పట్టుబడిన విద్యార్థులను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది.
అరెస్టుతో పాటు ప్రాసిక్యూషన్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. డ్రగ్స్ మీ చదువు, జీవితంపై దారుణమైన ప్రభావాన్ని చూపిస్తాయని, మీ ప్రశాంత వాతావరణాన్ని చెడగొడతాయని సూచించింది. విద్యార్థులే కాకుం డా ఎవరైనా డ్రగ్స్ తీసుకొన్నా, వాటిని సరఫరా చేసినా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది.