హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసు శాఖ కోరింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేసింది. వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో నీటిగుండా దాటే ప్రయత్నం చేయొద్దని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయాలని తెలంగాణ పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.
#TelanganaRains#Dial100 pic.twitter.com/T3NigETAzu
— Telangana State Police (@TelanganaCOPs) September 27, 2021