హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ, శాసనసభ ప్రాంగణాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘ కాలం పోరాటం చేసి, సాధించుకున్న రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతున్న నాయకుడు, సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తకళ్లపల్లి రవీందర్రావు, బొగ్గారపు దయానంద్, దండె విఠల్, నవీన్కుమార్, రఘోత్తంరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, బీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి, గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.