హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): విద్యారంగంలో కేజీ టు పీజీ విధానా న్ని ప్రకటించినట్టుగానే టీచర్ల కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ (టీఎస్జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.
ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత కేశవరావును కలిసి వినతిపత్రం అందజేశారు.