హైదరాబాద్ : కాసేపట్లో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షత రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సమావేశంలో 2021-22 బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, వయోపరిమితి పెంపు తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపైనా సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.