Road Accident | మహబూబ్నగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జడ్చర్ల/బాలానగర్: మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ వద్ద హైదరాబాద్ – నాగ్పూర్ హైవేపై డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఐదు గురు దుర్మరణం చెందారు. డీసీఎం వాహనం వేగం గా వచ్చి రోడ్డు దాటుతున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులపై దాడి చేశారు. మూడు గంటలపాటు జాతీయ రహదారి-44పై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
బాలానగర్లో శుక్రవారం అంగడి ఉండటంతో మోతిఘనపూర్, బీబీనగర్తోపాటు పలు గ్రామాలు, తండా వాసులతోపా టు బీహార్కు చెందిన కూలీలు సైతం వచ్చా రు. కూరగాయలతోపాటు ఇతర వస్తువులను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమవుతుండగా సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు టైర్ల లోడ్తో వేగం గా వెళ్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి బాలానగర్ చౌరస్తా వద్ద రోడ్డు దాడుతున్న బైక్తోపాటు మరో ఐదుగురిని, అప్పటికీ కం ట్రోల్ కాకపోవడంతో ముందు వెళ్తున్న ఆటో ను ఢీకొట్టింది.
దీంతో బైక్పై ఉన్న ఇద్దరితోపాటు రోడ్డు దాటుతున్న ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో బీబీనగర్ తండాకు చెందిన జున్ను(3), ఫణి (50), మోతిఘనపూర్కు చెందిన తల్లీబిడ్డలు మోక్ష(8), సునీత(32), బాలానగర్కు చెందిన జశ్వంత్(10) అక్కడికక్కడే మృతి చెందారు. మధ్యప్రదేశ్కు చెందిన భద్రాసింగ్, బీబీనగర్ తండాకు చెందిన మౌనిక తీవ్రంగా గాయపడగా.. మౌనికను మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ దవాఖాన కు, భద్రాసింగ్ను హైదరాబాద్లోని ఉస్మానియాకు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కలెక్టర్ రవినాయక్ ఆదేశించారు. డీసీఎం వాహనాన్ని వదిలి డ్రైవర్ పరారయ్యాడు.
కండ్ల ముందే ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో స్థానికులు ఆగ్రహంతో డీసీ ఎంకు నిప్పు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జడ్చర్ల రూరల్ సీఐ జములప్ప, బాలానగర్, రాజాపూర్ ఎస్సైలు వెంకట్రెడ్డి, శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. ఆగ్రహించిన గ్రామస్థులు వారిపై దాడి చేశారు. చేసేదేమి లేక పోలీసులు పరారయ్యారు. ఇక్కడి పరిస్థితిని పోలీస్ ఉన్నతాధికారులకు చేరవేశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9:30 వరకు ఆందోళనకారులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి వచ్చి బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో ఎస్పీ నరసింహ, డీఎస్పీ అదనపు బలగాలతో బాలానగర్కు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.
బాలానగర్కు చెందిన జశ్వంత్(10) పుట్టి న రోజు వేడుకలు జరుపుకొనేందుకు కేక్ కోసం సంతబజార్కు వచ్చి తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.