హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొల్ల కురుమలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై బుధవారం ఆయన మాసబ్ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎస్కే శర్మతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. రెండో విడత గొర్రెల పంపిణీకి సంబంధించిన రుణాన్ని మూడు నెలల్లోగా ఒకేసారి ఇవ్వాలని ఎన్సీడీసీ అధికారులను కోరారు.