హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తున్నది. మెదక్లో అత్యల్పంగా 14 డిగ్రీలు, అత్యధికంగా మహబూబ్నగర్లో 21 డిగ్రీలు నమోదు అయింది. నిజామాబాద్, కరీంగనర్ ప్రాంతాల్లో చలి వణుకు పుట్టిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏజెన్సీ ఏరియా లు, అరకు ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపో వడంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. లంబసింగిలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.