హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను కనీస మద్దతు ధరలతో మార్ఫెడ్ కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సం ఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, ప్రధాన కార్యదర్శి టీ సాగర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ ఏడాది పప్పుధాన్యాలు 6.5 లక్షల ఎకరాల్లో, నూనెగింజలు 4.48 లక్షల ఎకరాల్లో సాగు చేశారన్నారు. అతివృష్టి వల్ల పంట దిగుబడి తగ్గడంతో రైతులకు పెట్టుబడి దక్కని పరిస్థితి నెలకొన్నదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పండిన కొద్దిపాటి పంటలను కొనుగోలు చేయడానికి మార్ఫెడ్ ముందుకు రాకపోవడంతో రైతులకు నష్టం మరింత పెరిగిందని సాగర్ చెప్పారు. కనీస మద్దతు ధరలు పెసలు రూ.7,755, కందులు రూ.6,600, మొకజొన్న రూ.1962, వేరుశనగ రూ.5,850, సోయా రూ.4,300, మినుములు రూ.6,600, నువ్వులు రూ.7,830 చెల్లించి కొనుగోళ్లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.