హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 12న నిర్వహించే తెలంగాణ రన్ను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కోరారు. గురువారం సచివాలయంలో తెలంగాణ రన్ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతికుమారి మాట్లాడుతూ.. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహం సమీపంలోని మైదానం నుంచి 2 కే, 4 కే రన్ నిర్వహిస్తామని తెలిపారు. సుమారు 4వేల మంది రన్న ర్లు పాల్గొంటారని చెప్పారు. యువత, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు, పోలీసులు పాల్గొంటారని తెలిపా రు. సమావేశంలో డీజీపీ అంజనీకుమార్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.