హైదరాబాద్,ఎప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని కండక్టర్లకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. కండక్టర్లు, డ్రైవర్లే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కండక్టర్లకు టీఎస్ఆర్టీసీ ఏప్రిల్ చాలెంజ్ ఫర్ ట్రైనింగ్ (టాక్ట్) శుక్రవారం ప్రారంభమైంది.
హైదరాబాద్ బస్భవన్ నుంచి సజ్జనార్ వర్చువల్గా శిక్షణ తీరును పరిశీలించారు. ప్రయాణికులు బస్సులోకి రాగానే చిరునవ్వుతో పలకరించాలని కండక్టర్లకు సూచించారు. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియా (ఓఆర్) 69గా ఉన్నదని, దానిని 75కు పెంచడమే లక్ష్యంగా సిబ్బంది ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, ఓఎస్డీ (ఐటీ అండ్ డీ) యుగంధర్, సీటీఎం(ఎం అండ్ సీ) విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.