హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24గంటల్లో 852 కొత్త కేసులు నమోదయ్యాయి. థర్డ్వేవ్ తర్వాత తొలిసారిగా 800 కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 640 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,16,531కి పెరిగింది. ఇందులో 8,07,505 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు.
బుధవారం 36,764 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,915 యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసులతో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 358, మేడ్చల్ మల్కాజ్గిరిలో 63, రంగారెడ్డిలో 57, పెద్దపల్లిలో 35, మహబూబాబాద్లో 32, ఖమ్మంలో 28, హన్మకొండలో 26, నల్గొండలో 26, జనగామలో 26, కరీంనగర్లో 24, భద్రాద్రి కొత్తగూడెంలో 22 కేసులు నమోదయ్యాయి.