హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 485 కరోనా కేసులు నమోదయ్యాయి. 236 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,00,476కు చేరింది. ఇందులో 7,91,944 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా మొత్తం 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఒకే రోజు 27,130 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.51శాతం ఉందని, రికవరీ రేటు 98.93శాతం ఉందని వివరించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ నుంచే 257, రంగారెడ్డిలో 48, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో 37, ఖమ్మంలో పది కొత్త కేసులు రికార్డయ్యాయి.