హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 3,821 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,918 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 253 మందికి పాజిటివ్గా తేలింది.