హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా
1,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 16 మంది మృతిచెందారు. రాష్ట్రంలో 24 గంటల్లో 3,527 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 25,406 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో 165 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 1,32,996 శాంపిల్స్ పరీక్షించారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 5,93,103కు చేరింది.ఇవాళ్టి వరకు కొవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 3,394కి పెరిగింది.