హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1054 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,21,671కి చేరింది. తాజాగా 795 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 8,11,568 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు 4,111 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇవాళ 44,202 కరోనా పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.50శాతం, రికవరీ రేటు 98.77శాతంగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 396 నమోదయ్యాయి. రంగారెడ్డిలో 60, మేడ్చల్ మల్కాజ్గిరిలో 60, నల్గొండలో 49, కరీంనగర్లో 46, రాజన్న సిరిసిల్లలో 36, ఖమ్మంలో 31, మంచిర్యాలలో 31, సిద్ధిపేటలో 30 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో పేర్కొంది.