హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,707 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 582 మంది బాధితులు వైరస్ నుంచి కొలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో ఇద్దరు మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,02,801కి పెరిగింది. ఇందులో 6,78,290 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 4,049 మంది చనిపోయారు.
రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.57శాతంగా ఉందని, రికవరీ రేటు 96.51శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,462 యాక్టివ్ కేసులున్నాయని, ఇవాళ ఒకే రోజు 84,280 టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,328 నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరిలో 248, రంగారెడ్డిలో 202 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వివరించింది.