హైదరాబాద్ : ఏప్రిల్ నెలలో రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి 25 కిలోల బియ్యం అందించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ .15.15 కోట్లు విడుదల చేసింది. కాగా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించేందుకు విద్యాశాఖ ఇప్పటికే రూ. 32 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
పాఠశాలలు తిరిగి తెరిచే వరకు రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నెలకి రూ. 2 వేలు, 25 కిలోల బియ్యాన్ని అందిస్తదని సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రకారం ఈ నిధులను విడుదల చేశారు. సుమారు 1.24 లక్షల మంది సిబ్బంది ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందనున్నారు.