మేడ్చల్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సామాన్యులు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, వంటనూనె.. చివరకు పాల ప్యాకెట్ రేట్లు కూడా పెంచి ప్రజల ఉసురు పోసుకొంటున్నారని మండిపడుతున్నారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో ఆదాయం పన్ను (ఐటీ) విభాగం సోదాలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేయటంపై సామాన్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బుధవారం మంత్రి మల్లారెడ్డి అభిమాని అయిన కేతమ్మ అనే మహిళ తీవ్ర ఆవేదనతో బీజేపీకి శాపనార్థాలు పెట్టారు.
‘మంచినూనె రేటు పెంచితిరి.. పాలపాకీటు రేటు పెంచితిరి.. పెట్రోల్.. డీజిలి.. గ్యాసురేటు పెంచితే.. ఒక్కొక్కరు నోట్ల మన్నువోస్తుర్రు’ అని బీజేపీపై రెండుచేతులతో దుమ్మెత్తిపోశారు. ఆ సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రధాని నరేంద్రమోదీ డౌన్..డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశాయి. బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి సొంత టీవీ చానల్ వీ6 ప్రతినిధి ముందే ఆమె బీజేపీని చీల్చి చెండాడారు. మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై సామాన్యుల్లో పెరిగిపోయిన ఆగ్రహావేశాలకు ఆమె ఆవేదన అద్దంపట్టింది. కేతమ్మ ఆగ్రహం, ఆవేదన ఆమె మాటల్లోనే..
‘తెలంగాణ బిడ్డలు అమాయకులు. అంటే.. ఇవాళ ఒట్టిగ ఎవ్వలి జోలికి పోతలేం మేము. ఇయ్యాల మా మల్లన్న కష్టపడి పైకొచ్చిండు. శెమటసుక్క.. శెమటసుక్క రాల్సి పైకొచ్చిండు. ఎందుకంటే.. మేం హైదరాబాద్ల పుట్టన్నాడే బర్లదందా జేసిండు.. పాలు పితికిండు.. సైకిలుకు పాల క్యాన్లేసుకొని పాలమ్ముకొచ్చిండు.
బోయిన్పల్లిలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి
వీళ్లు.. వీళ్ల బొందలువెట్ట.. ఈ బీజేపీ లం.. (బూతు) చూసిర్రా అయ్యాలాలా? ఈ బీజేపోళ్లమీద మన్నువోస్తం..దుమ్మువోస్తం (రోడ్డుపై మన్నును రెండుచేతుల్లోకి తీసుకొని ఎత్తిపోసింది) బీజేపీ లం.. (బూతు) కొడుకుల మీద.. బీజేపీ మొండి లం..(బూతు) మీద.. మన్ను దుమ్మువోస్తం. ఆళ్ల సావుజెయ్య.
మా మల్లన్నోదిక్కయ్యిండు.. కొడుకులు దవాఖాండ్లల్లయ్యిండ్రు.. కోడండ్లోదిక్కయ్యిండ్రు. ఆళ్లకు బువ్వలేదు.. ఆళ్లకు మంచినీళ్లు లేవు. ఈ మోడీగాడు సచ్చిపోను.. ఈ బీజేపోళ్లు ఇర్గవడిపోను.. ఈ బీజేపీ ఇగ గెలువది..
లం.. (బూతు) రేట్లు వెంచితిరి.. మంచినూనె రేటు.. పాలపాకీటు రేటు.. లం (బూతు).. పెట్రోలు.. డీజిలి.. గ్యాసురేట్లువెంచితే ఒక్కొక్కరు నోట్ల మన్నువోస్తుర్రు.
ఎవనికి సానుభూతి సూపిత్తుర్రురా లం.. (బూతు)..? మీకు ఓట్లు వడ్తాయిరా? బోకెవట్టుకోని తిరుగుతున్నారు?
మీ పువ్వు గెలుత్తాది? నాశనమైపోతరు..
ఈ పది నెల్లల్ల తెలంగాణ రాష్ట్రం ఒక్కటై.. మోదీగాన్ని తరిమి తరిమికొడ్తం.. తన్ని తన్ని తన్ని..
గెలిసేది మా కేసీఆరే.. మళ్ల మంత్రి మా మల్లారెడ్డన్ననే..
నేనియ్యాల జెప్తున్నా.. నా తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛమైన రాష్ట్రం..’