B Vinod Kumar | అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. సుద్దాల, పల్లిమక్త, కనగర్తి, ధర్మారం, మర్తనపేట, నాగారం, మంగళ్లపల్లి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరించి బీఆర్ఎస్ చేస్తున్న.. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వినోద్ కుమార్ వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. పాదయాత్ర చేస్తూ పార్టీ క్యాడర్లో నింపుతూ వినోద్ కుమార్ ప్రచారం చేపట్టారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి వినోద్ కుమార్ ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.