బియ్యం, నూకలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదని కేంద్ర మంత్రి పీయూష్గోయల్ శుక్రవారం రాజ్యసభలో చెప్పారు. వాస్తవానికి ఉక్రెయిన్ యుద్ధంతో నూకలకు డిమాండ్ బాగా పెరిగిందని, క్వింటాల్ నూకలు అంతర్జాతీయ మార్కెట్లో రూ.2,200 పలుకుతున్నాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘బిజినెస్ లైన్’ మార్చి 29న ప్రచురించింది. ఎగుమతులకు డబ్ల్యూటీవో ఆంక్షలు అడ్డొస్తున్నాయని చెప్పిన గోయల్ మరోవైపు మిగిలిన బియ్యాన్ని కావాలంటే రాష్ట్రమే ఎగుమతి చేసుకోవచ్చని చెప్పారు. కేంద్రం ఎగుమతి చేయలేని బియ్యం రాష్ట్రం ఎలా చేయగలదో మాత్రం ఆయన చెప్పలేదు. పంజాబ్ బియ్యాన్ని దేశమంతా కొంటారని, అందుకే అక్కడ మొత్తం ధాన్యం సేకరిస్తున్నామని, తెలంగాణలో పండే బాయిల్డ్ రైస్ని ఎవరూ తినడం లేదంటూ కూడా గోయల్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): మళ్లీ అదే వెటకారం.. తిరస్కార భావం.. కేంద్రమంత్రి పీయూష్గోయల్ పనిగట్టుకొని తెలంగాణను అవమానించేలా వ్యవహరిస్తున్నారు. ధా న్యం సేకరించాలని గతంలో రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతినిధులను ‘మీ ప్రజలకు నూకలు తినటం నేర్పించండి’ అని ఒకసారి.. ‘మీకేం పనిలేదా’ అని మరోసారి అవమానించిన ఆయన, శుక్రవా రం పార్లమెంటు సాక్షిగా మరోసారి అలాంటి వ్యా ఖ్యలే చేశారు. ధాన్యం సేకరణపై రాజ్యసభలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అడిగి న ప్రశ్నకు పీయూష్ వెటకారంగా సమాధానమిచ్చారు. తెలంగాణ నుంచి ఎంత ధాన్యం సేకరిస్తా రో కేంద్రం స్పష్టత ఇవ్వటంలేదని కేకే తెలుపగా, ‘మీకు అర్థమయ్యేలా చేసే వైద్యం నా వద్ద లేదు’ అని గోయల్ వ్యాఖ్యానించారు. కొందరు ముఖ్యమంత్రుల ద్వారా తమకు ధమ్కీలిస్తున్నారని, మంత్రుల బృందాలు పదేపదే వచ్చి సతాయిస్తున్నాయని నిందించారు. పంజాబ్ బియ్యం దేశమంతా కొంటారు కాబట్టి తాము ఆ రాష్ట్రం నుం చి మొత్తం సేకరిస్తున్నామని, తెలంగాణలో పండే బాయిల్డ్ రైస్ ఎవరూ తినరు కాబట్టి కొనటంలేదని తెలిపారు. సభలో ఎవరేమన్నారో చూద్దాం..
కేకే: మేం ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ నుం చి ఎంత ధాన్యం సేకరిస్తుందో కేంద్రం స్పష్టంగా చెప్పడం లేదు. వికేంద్రీకృత సేకరణ విధానంలో ధాన్యం మార్కెట్కు వచ్చిన రోజే కొనుగోలు చే యాల్సి ఉంటుంది. రైతుల నుంచి జూన్లో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొంటే ఆగస్టులో కేంద్రం డ బ్బులు చెల్లిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరించి మిల్లింగ్ చేయించి కేంద్ర సర్కారుకు చెందిన ఎఫ్సీఐ గోదాములకు చేరవేస్తున్నది. ధాన్య సేకరణకు సంబంధించిన ఒప్పందాల్లో, ఇతర అధికారిక పత్రాల్లో కేంద్రం ధాన్యం కొంటుందని మాత్ర మే ఉన్నది. ధాన్యమంటే వడ్లు మాత్రమే. అమ్ముకోవడానికి సిద్ధంగాఉన్న బియ్యం కాదు. రాజ్యాంగంలో, ఇతర చట్ట పుస్తకాల్లో ధాన్యం అనే ఉన్నది. ధాన్యం మరాడిస్తే ఎలాంటి బియ్యం వస్తాయో చెప్పలేం. వివిధ రాష్ర్టాల్లో అక్కడికే ప్రత్యేకమైన ర కం ఉంటుంది. తెలంగాణలో ఒకరకం ఉంటే ఒడిశాలో మరో రకం ఉంటుంది.
పీయూష్ గోయల్: నేను దీనిపై ఇదివరకే స్ప ష్టం చేశాను. అంతకంటే విపులంగా చెప్పలేను. అర్థం చేసుకోవద్దని అనుకొంటే ఏమీ చేయలేను. దీనికి నా వద్ద ఎలాంటి చికిత్స లేదు. తెలంగాణ ప్రభుత్వం బాయిల్డ్ బియ్యం కేంద్రానికి ఇవ్వబోమని లిఖితపూర్వకంగా తెలిపింది. ఇప్పుడు బి య్యం కాదు.. ధాన్యం అంటూ ఈయన (కేకే) కొ త్త కథ వినిపిస్తున్నారు. దీనికి ఎలాంటి ఆధారం లేదు. సంవత్సరాలుగా ఎఫ్సీఐ బియ్యం కొంటున్నది. పంజాబ్ తరహాలో తెలంగాణ నుంచి కూడా సేకరించాలని ఆ రాష్ట్ర సీఎం లేఖ రాశారు. పంజాబ్ తరహాలో బియ్యం ఇస్తే కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. పంజాబ్ నుంచి దేశమంతటా అమ్ముడయ్యే బియ్యం వస్తుంది. దానినే కేంద్రం కొంటున్నది. తెలంగాణ బియ్యాన్ని కూడా కొం టున్నాం. కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వ ఆరోపణ లు నిరాధారమైనవి. బియ్యం సేకరణపై కొందరు ముఖ్యమంత్రుల ద్వారా మాకు ధమ్కీలిస్తున్నారు. మంత్రుల బృందాలు పదేపదే వచ్చి ధాన్యం కొం టరా? కొనరా? అని సతాయిస్తున్నాయి. బాయి ల్డ్ బియ్యం పండించే రాష్ర్టాలు వారికి అవసరమైన మొత్తం వాడుకొని, మిగులును ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఎగుమతి కూడా చేసుకోవచ్చు. ఎవరూ కొనని బియ్యాన్ని తీసుకొని మేమేం చేసుకొం టాం. ప్రజాధనాన్ని సద్వినియోగం చేసే బాధ్యత మాపై ఉన్నది.
మీకేం పని లేదా..?ఎందుకు ఊకే ఢిల్లీకి వస్తరు?
– డిసెంబర్ 29,2021న రాష్ట్ర మంత్రుల బృందంతో గోయల్
మీ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండి. బాయిల్డ్ రైస్ సమస్య పరిష్కారమవుతుంది.
తెలంగాణలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉన్నది. రాష్ట్రంలో ఎంత పండితే అంత కొనడానికి కేంద్రం ప్రైవేటు సంస్థ కాదు. దుకాణంలో ఏదైతే అమ్ముడుపోతదో వాటినే కొనుగోలు చేస్తం.
– మార్చి 24, 2022న ఎంపీలు, మంత్రుల బృందంతో గోయల్
పంజాబ్ బియ్యాన్ని దేశంలో ఎక్కడైనా తింటరు. తెలంగాణ బియ్యాన్ని తినరు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే బియ్యం, నూకలకు అంతర్జాతీయంగా ఎగుమతికి డిమాండ్ లేదు.
– ఏప్రిల్1, 2022న రాజ్యసభలో పీయూష్ గోయల్