హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు తత్కాల్ స్కీం కింద ఈ నెల 10 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
పరీక్ష ఫీజుతోపాటు ఎస్సెస్సీ విద్యార్థులు రూ.500, ఇంటర్ విద్యార్థులు రూ.1 వెయ్యి తత్కాల్ కింద అదనంగా చెల్లించాలని, పరీక్షలను ఏప్రిల్, మే నెలల్లో నిర్వహిస్తామని డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.