సిద్దిపేట, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లాలో మరో రెండు కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. కుకునూర్పల్లి, అక్బర్పేట-భూంపల్లి ఎక్స్ రోడ్ను కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త మండలాల ఏర్పాటుపై 15 రోజుల వరకు అభ్యంతరాలు, సూచనలను స్వీకరించి, వాటిని పరిష్కరించి తుది ప్రకటన జారీ చేయనున్నది.
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కుకునూర్పల్లిలో 16 రెవెన్యూ గ్రామాలు, దుబ్బాక నియోజకవర్గంలోని భూంపల్లి-అక్బర్పేట ఎక్స్రోడ్లో 10 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలో రెండు కొత్త మండలాల ఏర్పాటు పట్ల స్థానికులు సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బుధవారం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కొత్త మండలాలతో కలిపి సిద్దిపేట జిల్లాలో మండలాల సంఖ్య 26కు చేరుకోనున్నది.