మహబూబాబాద్ : దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పథకాలను(Telangana schemes) గడపగడపకు తీసుకెళ్లే బాధ్యత బీఆర్ఎస్(Brs) పార్టీ కార్యకర్తలపై ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli)అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం రాయపర్తి శివారు తోట, మొరిపిరాల క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాలలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, సమైక్య పాలనలో నిరాదరణకు గురైన పల్లెలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram), 24 గంటల కరెంటు, రైతు బంధు(Raitu bandhu), ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి (Kalyana laxmi) పథకాలు దేశానికే దిక్సూచీలుగా మారాయని తెలిపారు. అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నెం 1 గా నిలిచిందని ప్రశంసించారు. తెలంగాణ అభివృద్దిని చూసి ఓర్చుకోలేకనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
తెలంగాణకు నయాపైసా ఇవ్వని బీజేపీ నాయకులు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సీఎం కేసీఆర్ తిప్పికొట్టారన్నారు. మాయ మాటలతో తెలంగాణను ఆగం పట్టియ్యాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.