హైదరాబాద్, మే23(నమస్తే తెలంగాణ): న్యాయశాఖ కార్యదర్శిగా నర్సింగ్రావు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం బీఆర్కేభవన్లోని న్యాయశాఖ కార్యాలయంలో వేదపండితుల ఆశీర్వచనం పొందిన ఆయన సంబంధిత ఫైల్పై సంతకం చేశారు. అనంతరం అరణ్యభవన్లో న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సింగ్రావుకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.