హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. నూతన జోన్లు ఏంటో చూద్దాం.. తెలంగాణలో ప్రస్తుతం రెండు జోన్లు ఉండగా.. వీటి స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పాటు చేశారు.
వీటిలో తొలి నాలుగు జోన్లను ఒక మల్టీ జోన్గా, తర్వాతి మూడు జోన్లను మరో మల్టీజోన్గా పరిగణిస్తారు. ఇప్పటి వరకూ నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లానే స్థానికతగా పరిగణిస్తారు. ఇక నుంచి ఏడో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు.
ఇవి కూడా చదవండి..