హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాడల్ దేశమంతా విస్తరించాలని మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ తరం వారసుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజే అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతున్నదని కొనియాడారు. గురువారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. శంభాజీ రాజేను సీఎం ఘనంగా సత్కరించారు. మధ్యాహ్న భోజనంతో ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం సీఎం కేసీఆర్తో శంభాజీ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును శంభాజీ అడిగి తెలుసుకొన్నారు. తెలంగాణ మాడల్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలుచేస్తే బాగుంటుందని అన్నారు. అద్భుతమైన తెలంగాణ ప్రగతి నమూనా ఇకడికేపరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. దేశ సమగ్రత, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వినూత్న ఎజెండాతో ప్రజలముందుకు రావాల్సిన అవసరమున్నదని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ‘రాజర్షి సాహు ఛత్రపతి’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్కు శంభాజీ రాజే అందించారు. ఈ సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకంట్ల కవిత, సిరికొండ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు
పాల్గొన్నారు.