సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలోని ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీ ఆవరణలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రూట్స్ నర్సరీని కేబినెట్ సబ్ కమిటీ సందర్శించింది. పండ్ల ఉద్యానవనంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ మామిడి పండ్ల చెట్లను పరిశీలించారు. మంత్రుల బృందం ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. మరికాసేపట్లో ములుగు హార్టికల్చరల్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభం కానున్నది.