తెలంగాణ రాష్ట్ర వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో మాట్లాడేందుకు రాష్ట్ర మంత్రుల్లో చాలా మంది ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను వీరంతా కలిశారు. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రికి రాష్ట్ర పరిస్థితులను వివరించారు.
ధాన్యం కొనుగోలు విషయంపై చర్చించారు. రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగులు చేసే విషయం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ భేటీలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.