ప్రజల హృదయాలను హత్తుకునేలా నిర్మించాలి
ప్రత్యేక శ్రద్ధతో పనులు చేయాలి
అధికారులతో మంత్రి ప్రశాంత్రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 25 : తెలంగాణ అమరవీరుల త్యాగాలు నిరంతరం జ్వలించే జ్వాలలా ఉండే జ్యోతి నిర్మాణం, ఫినిషింగ్ పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల హృదయాలను హత్తుకునే ఈ నిర్మాణ పనులు మనసుపెట్టి చేయాలని, స్మారక చిహ్నం అద్భుతంగా ఉండాలని అధికారులను, ఆరిటెక్ట్లను, వర్ ఏజన్సీని ఆదేశించారు. హుసేన్సాగర్ ఒడ్డున ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ స్మారక చిహ్నం పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎంట్రీ గేట్, కాంపౌండ్ వాల్ రెయిలింగ్, పోడియం ప్రాంగ ణం, మెయిన్ ఎంట్రన్స్లోని వాటర్ ఫౌంటెయి న్, ర్యాంప్ కవరింగ్, ఫోటో గ్యాలరీ మ్యూజి యం, ఆడిటోరియం, టెర్రస్ రెస్టారెంట్, పై అంతస్థులకు వెళ్లే ఎసలేటర్ ఏరియా, లిఫ్ట్ల నిర్మాణ పనులతోపాటు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేయనున్న ఫ్లోరింగ్, వాల్ టైల్స్ ను పరిశీలించారు. ముఖ్యంగా క్రిస్టల్ బ్రౌన్, రోజీ పింక్, చైనా పింక్, కశ్మీర్ గోల్డ్, పింక్ వైట్, బ్లాక్ పియర్స్, మహోగని, బ్లాక్ వేవ్, స్టీల్ గ్రే పాలిష్, మెక్సికన్ రెడ్, స్పెర్గ్రే యాంటిక్ ఫినిష్ లాంటి వివిధ రకాల టైల్స్ను పరిశీలించారు. తుదిదశకు చేరిన పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, అమరుల త్యాగాలను తెలియజెప్పేలా మ్యూజియం నిర్మాణం ఉండాలని చెప్పారు. మంత్రి వెంట ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈ లింగారెడ్డి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆరిటెక్ట్లు, అధికారులు ఉన్నారు.