హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) లోక్సభ ఎన్నికల నామినేషన్లో భాగంగా మూడో రోజు శనివారం 65 మంది 77 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మూడు రోజుల్లో మొత్తం 156 మంది నామినేషన్ వేశారు. మెదక్లో ఎనిమిదిమంది, మల్కాజ్గిరి, నల్గొండలో ఏడుగురు చొప్పున, పెద్దపల్లిలో ఆరుగురు, జహీరాబాద్, భువనగిరి, చేవెళ్లలో ఐదుగురు చొప్పున, వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్లో నలుగురు చొప్పున, కరీంనగర్, సికింద్రాబాద్లో ముగ్గురు చొప్పున , ఖమ్మం, మహబూబ్నగర్లో ఇద్దరు చొప్పున నామినేషన్లు వేశారు.