హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఏటా పెరుగుతుండగా, ప్రైవేట్ స్కూళ్లలో క్రమంగా పడిపోతున్నాయి. 2014-15లో ప్రభుత్వ బడుల్లో నమోదు 47.88 శాతం ఉండగా, 2021- 22లో 49.77 శాతం ఉన్నది. అదే ప్రైవేట్ బడుల్లో 2014- 15లో నమోదు 52.12 శాతం ఉండగా, 2021- 22కు వచ్చేసరికి 50.23 శాతానికి పడిపోయింది. ప్రభుత్వ బడుల్లో నమోదు 2020 -21లో 43.47 శాతమే ఉండగా, 2021-22కు వచ్చేసరికి 49.77 శాతానికి పెరిగింది.
సర్వేలో ముఖ్యాంశాలు
ఇంటర్లో జాతీయ సగటును మించి ప్రవేశాలు
గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో జాతీయ సగటుతో పోల్చితే ఇంటర్ ప్రవేశాలలో తెలంగాణ ముందంజలో ఉన్నది. జాతీయంగా 57.6 శాతమైతే, రాష్ట్రంలో 64.80 శాతం నమోదైంది. బాలుర నమోదు జాతీయంగా 57 శాతం కాగా, రాష్ట్రంలో 63.10 శాతం, బాలికల నమోదు జాతీయంగా 58.2 శాతమైతే, రాష్ట్రంలో 66.70 శాతంగా ఉన్నది.