Telangana | నల్లగొండ : తెలంగాణలో అన్నదాతలే పరిస్థితే కాదు.. కూలీల పరిస్థితి కూడా అధ్వాన్నంగా మారింది. గతంలో చేతి నిండా పని దొరికిన కూలీలకు.. ఇప్పుడు పని కరువైంది. సాగునీరు లేక పంటలు ఎండిపోవడంతో.. అటు అన్నదాతలు బోరుమంటున్నారు. ఇటు పనుల్లేక వ్యవసాయ కూలీలు విలవిలలాడిపోతున్నారు. పొట్టకూటి కోసం ఆంధ్రాకు తరలివెళ్తున్నారు వ్యవసాయ కూలీలు.
నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలంలో సాగునీరు లేక పంటలు ఎండిపోయాయి. దీంతో కూలీలకు పని లేకుండా పోయింది. కడుపు నింపుకునేందుకు, కుటుంబాన్ని పోషించుకునేందుకు కూలీలు.. ఆంధ్రా బాట పట్టారు. ఆంధ్రాలో పత్తి, మిర్చి పంట ఏరేందుకు ఆటోల్లో భారీ సంఖ్యలో కూలీలు తరలివెళ్తున్నారు. నిడమనూరు, త్రిపురారం, వేములపల్లి, మిర్యాలగూడకు చెందిన కూలీలు.. నిత్యం ఆటోలు, డీసీఎంలలో ఆంధ్రాకు వెళ్తున్నారు.