Minister KTR | టీఎస్పీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీరు పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో బీజేపీపై మంత్రి కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీ సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోందని ట్విట్టర్ వేదికగా అనుమానం వ్యక్తం చేశారు.
ఏఈ పేపర్ లీకేజీకి సంబంధించిన కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్త అని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు అన్నారు. ఇందుకు సాక్ష్యంగా బీజేపీ కండువాలతో ఉన్న నిందితుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన పలు ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గతంలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేశాడంటూ పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని తెలంగాణ బీజేపీ ఖండించగలదా అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడంటూ పేర్కొన్నారు.
ఇప్పుడీ ట్వీట్ను రీట్వీట్ చేసిన కేటీఆర్ పలు అనుమానాలను వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లేందుకే బీజేపీ కుట్ర పన్నినట్లు కనిపిస్తోందని ట్వీట్ చేశారు. బీజేపీ రోజురోజుకు నీచస్థాయికి దిగజారిపోతోందని, ఇప్పుడు మరింత దిగజారిందని కేటీఆర్ మండిపడ్డారు. అమాయకులైన యువత జీవితాలను నాశనం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నినట్లు అనిపిస్తోందని అన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ కుట్ర వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని, సమగ్ర విచారణ జరిపించాలని డీజీపి అంజనీ కుమార్కు కేటీఆర్ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Even by the very low standards of BJP, this is vulgarity at its worst
Just to malign Telangana Govt, BJP seems to have hatched a conspiracy to destroy the lives of innocent youth
I request the @TelanganaDGP Garu to enquire this matter thoroughly and bring perpetrators to… https://t.co/kZnCg0GRWH
— KTR (@KTRBRS) March 15, 2023