ప్రతి రెండు నిమిషాలకు ఓ ఉద్యోగం అంటే గంటకు 30 ఉద్యోగాలు ఇందులో మూడు ప్రభుత్వ కొలువులు.. మిగతా 27 ప్రైవేటు ఉద్యోగాలు గడచిన తొమ్మిదిన్నరేండ్లలో మొత్తం 25 లక్షల ఉద్యోగాల కల్పన బీఆర్ఎస్ సర్కారు ట్రాక్ రికార్డు ఇది. పదేండ్లలో 10,080 ప్రభుత్వ ఉద్యోగాలు సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలివి. మూడేండ్లలో 21 సర్కారీ కొలువులు డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు ఉన్న మధ్యప్రదేశ్ ట్రాక్ రికార్డు ఇది.
Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ, అధికారాన్ని అప్పగించిన ఆరు నెలల్లోనే ఖాళీలను భర్తీచేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ పాలనలోని రాష్ర్టాల్లో నిరుద్యోగిత రేటు ఆకాశాన్నంటుతున్నది. లక్షలాది మంది నిరుద్యోగులు డిగ్రీ పట్టాలు చేతబట్టి రోడ్లమీద తిరుగుతున్నారు. అయితే..నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదిన్నరేండ్లలోనే 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలకు అనుమతి ఇచ్చింది. అందులో నియామక సంస్థలు 27 శాఖల్లో 2,02,735 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాయి. ఇప్పటి వరకు 1,60,083 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయింది. మరో 42,652 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రైవేటురంగంలో మరో 22.5 లక్షలకు పైగా ఉద్యోగకల్పన జరిగింది. అలా గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో 25 లక్షల ఉద్యోగాలనిచ్చి దేశంలో అతితక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గత తొమ్మిదిన్నరేండ్ల సగటును పరిశీలిస్తే కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాలు ఉద్యోగకల్పనలో తెలంగాణ దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం.
కాంగ్రెస్తో పోలిస్తే 23 రెట్లు ఎక్కువ
సమైక్య రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 మధ్య 24,086 ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే భర్తీచేసింది. ఇందులో తెలంగాణ పది జిల్లాల వాటా 42 శాతం అనుకుంటే.. దక్కినవి కేవలం 10,080 ఉద్యోగాలే. అదే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. అంటే 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య అక్షరాల 2,32,308. ఈ లెక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటితో పోలిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 23 రెట్లు ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది.
10.05 శాతానికి నిరుద్యోగిత రేటు
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదిక ప్రకారం.. సెప్టెంబర్లో దేశంలో 7.09 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు అక్టోబర్ నాటికి 10.05 శాతానికి ఎగబాకింది. గడిచిన రెండున్నరేండ్లలో కరోనా సంక్షోభం తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు పెరుగడం ఇదే తొలిసారి. గడిచిన నెలరోజుల వ్యవధిలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 6.2 శాతం నుంచి ఏకంగా 10.82 శాతానికి పెరగ్గా, పట్టణాల్లో ఇదే సమయంలో 8.44 శాతానికి చేరింది. దేశంలోని మొత్తం శ్రామికవర్గంలో కేవలం 43 శాతం మందికే ఉద్యోగాలు ఉండగా, ఇప్పటికిప్పుడు అర్హతకు తగిన ఉద్యోగాలు కావాల్సినవారు 22 కోట్ల మంది వరకు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. గత అక్టోబర్లో భారత మార్కెట్లోకి కొత్తగా కోటి మంది ఉద్యోగార్థులు చేరినట్టు సీఎంఐఈ తెలిపింది. కాగా, ఈ ఏడాది చివరినాటికి పది లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ఆర్భాటంగా ప్రకటించారు. అయితే, ఆచరణలో మాత్రం అది జరుగడంలేదని సీఎంఐఈ తాజా నివేదికను బట్టి అర్థమవుతున్నది.
తొలి స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ రాష్ర్టాలే
సీఎంఐఈ గణాంకాల ప్రకారం.. దేశంలో అత్యధిక నిరుద్యోగం ఉన్న రాష్ర్టాల్లో బీజేపీపాలిత హర్యానా (37.4 శాతం) తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో కాంగ్రెస్పాలిత రాజస్థాన్ (28.5 శాతం) నిలిచింది. రాజస్థాన్లో 18.4 లక్షల కంటే ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నట్టు గత ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రభుత్వమే ఒప్పుకొన్నది. 2018లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరీక్షా పత్రాలు లీక్ కావడంవల్ల గెహ్లాట్ సర్కారు కనీసం 12 పరీక్షలను రద్దు చేసింది.
బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఇలా