నేడు జగ్జీవన్రామ్ జయంతి వేడుకల్లో అందరూ పాల్గొనాలి: ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు
హైదరాబాద్, ఏప్రిల్ 4 : సబ్బండ వర్గాల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం చిరునామాగా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అభివృద్ధిలో దేశానికే దిక్సూచిలా మారిందని పేర్కొన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవాల పోస్టర్ను సోమవారం మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి ఆవిష్కరించారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి జగ్జీవన్రామ్ చేసిన సేవలను కొనియాడారు. ఆ మహనీయుని జయంతి వేడుకల్లో ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి కొప్పుల పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జగ్జీవన్రామ్, అంబేద్కర్ రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవాల కమిటీ వర్కింగ్ చైర్మన్లు రావుల విజయ్కుమార్, నాగారం బాబు, వైస్ చైర్మన్లు ఏర్పుల యాదయ్య, తూర్పాటి హన్మంతు, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.