హైదరాబాద్: అన్నిరకాల మౌలిక వసతులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఇలా ప్రపంచంలో అన్ని వసతులతో అభివృద్ధి చెందే అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ (Telangana) ఒకటని చెప్పారు. రాష్ట్రంలో గ్రీన్ కవర్ (Green cover) 7.7 శాతం వృద్ధి చెందిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దూరదృష్టితో ప్రవేశపెట్టిన హరితహారంతోనే (Haritha Haram) ఇది సాధ్యమైందన్నారు. సీఎం కేసీఆర్ వంటి నిజమైన పర్యావరణవేత్తే సమగ్ర, స్థిరమైన అభివృద్ధి గురించి ఆలోచిస్తామరని వెల్లడించారు. ప్రతి ప్రభుత్వం ఏం చేయాలో ప్రపంచానికి తెలంగాణ సగర్వంగా చాటిచెప్పిందని తెలిపారు. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందని ట్వీట్ చేశారు.
హరితహారంలో భాగంగా రాష్ట్రంలో 14,864 నర్సరీలను, 19,472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటుచేశామన్నారు. మొత్తం 13.44 లక్షల ఎకరాల్లో అడవులను పునరుద్ధరించామని, ఇప్పటివరకు 273 కోట్ల మొక్కలను నాటామన్నారు.
Telangana is one of the rare places in the world where Infrastructure grows, so does the Green cover. This is evident from the remarkable 7.7% growth in green cover, only possible by virtue of CM KCR garu’s visionary program #HarithaHaram
🌳Nurseries established: 14,864.… pic.twitter.com/IF2jn00VKP
— Harish Rao Thanneeru (@BRSHarish) June 19, 2023