హైదరాబాద్: రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 540 మండల పరిషత్లు, 32 జిల్లా పరిషత్లలో 100శాతం ఆన్లైన్ ఆడిట్ లక్ష్యాన్ని సాధించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ విషయంలో వరుసగా రెండో ఏడాది కూడా తెలంగాణ ‘నేషనల్ లీడ్ స్టేట్’గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఇటీవల వచ్చిన కథనంపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. “విజయవంతమైన తెలంగాణ.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆయన బృందానికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు.
Congratulations to Panchayat Raj & Rural Development Minister @DayakarRao2019 Garu and his team 👏 https://t.co/gKyg17DVcd
— KTR (@KTRTRS) May 2, 2022