CM KCR | రాబోయే రోజుల్లో వరిధాన్యం సేకరణలో తెలంగాణ నెంబర్ వన్ కాబోతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. బాల్కొండ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రశాంత్రెడ్డి తల్లి చనిపోతే పరామర్శించి వెళ్లిపోతున్న సమయంలో ఆర్మూర్ జీవన్రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వచ్చి సార్ మక్కలు కొనాలని మొదలపెట్టాలని మొదలుపెట్టారు. నేను చెప్పినా రాంగనే చూసుకుంటూ వచ్చిన.. పచ్చగా మంచిగా కళ్లాలు కనిపిస్తున్నయ్. ఎండపోయి మక్కలు కనిపించినయ్. మీరు మొదలుపెడుతరని ఆ రోజు చెప్పాను’ అంటూ గుర్తు చేసుకున్నారు.
‘ధాన్యం కొనుగోలు మొత్తం కొనుగోలు చేస్తున్నాం. మీ దగ్గర ఇంకా నడుస్తున్నది. మెదక్ మంత్రి, ఆయన ఒకాయన నా ప్రాణానికి ఉన్నరు. వద్దయ్యంటే పచ్చజొన్నలు పండిస్తరు. నేను చెప్పిన ఆర్మూర్లో, బాల్కొండలో ఎర్రజొన్నలు వేస్తే ఆఖరికి అమ్ముడుపోతయ్ అని చెప్పినా. పంజాబ్కు విత్తనాలకు పోతయ్ అంటే వినరు. పచ్చజొన్నలే వేస్తరు. పచ్చజొన్నలు ఎవరన్నా తినటట్టు ఉన్నరా? అవి రూ.2వేలకు కొనాలి.. రూ.1000 కూడా ఎవరూ కొనడం లేదు. అయినా సరే కొనాలని చెప్పాం. ధాన్యం కొని తద్వారా వచ్చే నష్టాన్ని ప్రభుత్వం భరిస్తున్నది. మునుపు సేట్ల ఇష్టం వచ్చినప్పుడు కొనేవారు. ఇప్పుడు ధాన్యం కొంటే పదిరోజుల్లో ధాన్యం డబ్బులు ఖాతాల్లోపడిపోతున్నయ్. రైతుబంధు వస్తున్నది. ఇక్కడ మేం వేయగానే.. సెల్ఫోన్ టింగుటింగుమని మోగుతున్నది. ఫోన్లోనే ఇన్ని డబ్బులు వచ్చిపడ్డయ్ అని ఉంటది’ అన్నారు.
‘అదృష్టం బాగోలేక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డున పడకూడదని రూ.5లక్షల బీమా పెట్టాం. కాంగ్రెస్ రాజ్యంలో ఆపద్బాందు ఉండే.. రూ.50వేలు ఇస్తామని చెప్పారు.. కానీ తిరుగుతుంటే చెప్పులరిగిపోతుండే కానీ.. చివరకు రూ.10వేలు, 20వేలు చేతులో పెట్టి దళారులు మింగిపోదురు. రైతుబంధు, బీమా, ధాన్యం డబ్బులు ఖాతాల్లోనే పడుతున్నయ్. గతంలో రైతుల రికార్డులు మునుపు వీఆర్వోలు, గిర్దావర్లు, ఎమ్మార్వోలు బాస్లుగా ఉండేవారు. ఎవరు ఒక్కరు కిందమీద చేసినా కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లే ఉండే.
మునుపు రిజిస్ట్రేషన్ అయ్యాక పట్టా కావాలంటే.. తిరిగి తిరిగి చెప్పులు అరుగుతుండే. ఈ రోజు మండల కేంద్రానికి వెళ్లే పొద్దున వెళ్లే.. మధ్యాహ్నం వరకు ఇంటికి రావొచ్చు. 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మరో 15 నిమిషాల్లో పట్టా, మ్యుటేషన్ అయిపోతది. మీ పిల్లలు అమెరికాలో ఉన్నా చూసుకోవచ్చు. ఇవాళ మధ్య ప్రదేశ్లో, గుజరాత్ ప్రధాని రాష్ట్రంలో ఎరువు బస్తాల కోసం చెప్పుల లైన్లలో ఉన్నయ్. మన దగ్గర కూడా లేకుండెనా. పోలీసు స్టేషన్లలో పెట్టి అమ్మలేదా? రైతులను ఆర్మూర్లో కాల్చివేయలేదా? ఆ ప్రభుత్వాలను మీరు చూశారు. అందుకే ఆ పార్టీల నడవడిక చూడాలని కోరుతున్నాను’ అన్నారు.
‘ఏయే తప్పులు, ఏ బాధలతో రైతులు బలహీనపడ్డరో.. తెలంగాణ రైతాంగం ఆగమైంద.. ఆ బాధలు నివారణ చేయాలని అరవ కష్టాలుపడి ఈ వసతులు ఏర్పాటు చేశాం. ఇదో పాలసీ. ఆషామాషీగా ఎలక్షన్ల కోసం చేయలేదు. నాకు రైతుబంధు పెట్టాలని దరఖాస్తు ఇచ్చారా? ఉద్యమం చేశారా? ఎవరైనా అడిగారా? నా అంతట నేను రైతు నాయకులు, మేధావులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. దాని ఫలితం తెలంగాణ ఇవాళ 3కోట్ల టన్నుల ధాన్యం పడిస్తున్నది. సీతారామ ప్రాజెక్టు, పాలమూరు మొత్తం పూర్తయితే 4లక్షల కోట్ల టన్నుల ధాన్యం పండించి భారత్లోనే నెంబర్ వన్గా రాబోతున్నది. ఈ ఫలితాలు మన కండ్ల ముందుకు కనిపిస్తున్నయ్. వ్యక్తే కాదు.. వ్యక్తి వెనుకున్న పార్టీ.. ఆ పార్టీ చరిత్రను చూడాలని కోరుతున్నా’నన్నారు.