కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా
హైదరాబాద్, సెప్టెంబర్ 13 ( నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలకు సంబంధించిన పథకాల అమలులో తెలంగాణ ముందంజలో ఉన్నదని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా ప్రశంసించారు. మహిళా స్వయంసహాయక సంఘాల ఏర్పాటు, కార్యక్రమాల నిర్వహణలో తెలంగాణ కృషి బాగున్నదని మెచ్చుకున్నారు. ఇదే స్పూర్తితో ప్రతి మహిళా సంఘం సభ్యురాలి ఆదాయం పెరిగే కార్యక్రమాలు చేపట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన నరేంద్రనాథ్సిన్హాకు రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఆ శాఖల కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో వచ్చిన మార్పు, పచ్చదనం, పరిశుభ్రత విషయంలో సాధించిన విజయాలను సిన్హా దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ.227 కోట్ల నిధులు అందజేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.10 వేల కోట్లకుపైగా బ్యాంకు రుణాలిస్తున్నట్టు పేర్కొన్నారు.