హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారనున్నదని ఏపీ బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ఆదివారం బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ నివాసంలో ఆత్మీ య సమావేశం నిర్వహించారు. ఏపీలోని పలు జిల్లాల నుంచి ఆయన మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దేశానికే మాడల్గా నిలిచిందని కొనియాడారు.