ధర్మపురి(జగిత్యాల) : రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం సందర్భంగా రాష్ట్ర సంక్షేమ, మైనార్టీ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్(Ramzan) పవిత్రమైన పండుగని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని అందించే పండుగని అన్నారు .
రంజాన్ మాసంలో ఆచరించే ప్రార్థనలు, ఉపవాసం, క్రమశిక్షణను ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయన్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు తమ పవిత్ర ప్రార్థనలతో అల్లాహ్ దీవెనలు పొందాలని అభిలషించారు. రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని ఆయన కోరారు. లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం(Model)గా నిలిచిందన్నారు.
సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో దేశంలోనే తొలిసారిగా ఇమామ్(Imam)లకు నెలకు రూ.5వేల గౌరవ వేతనం, నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు షాదీ ముబారక్(Shadi Mubarak) ద్వారా రూ. లక్షా నూటపదహారు అందజేస్తుందన్నారు. యువతకు ప్రత్యేక శిక్షణను ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందని వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) సెక్యూలర్ నాయకుడని, ముస్లింల జీవితాల్లో విప్లవాత్మక మార్పును తెచ్చేందుకు రెనిడెన్షియల్ పాఠశాలలు(Residential Schools), కళాశాల(College)లు నెలకొల్పారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనారిటీలకు వందేళ్లలో కాంగ్రెస్ ఖర్చు చేసింది కేవలం రూ.1200కోట్లు మాత్రమే కాగా తెలంగాణ ప్రభుత్వ హయాంలో తొమ్మిదేళ్లల్లో రూ.12వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.